బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హిందీ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. టాలీవుడ్లో వన్ నేనొక్కడినే , దోచేయ్ చిత్రాలు చేసిన కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్లో సత్తా చాటుతుంది. తాజాగా ఈ అమ్మడికి పాన్ ఇండియా ప్రాజెక్ట్లో సీతగా నటించే ఛాన్స్ దక్కింది. ఎంతో మంది కథానాయికలను పరిశీలించి చివరికి కృతి సనన్ను ఎంపిక చేశారు. ఈ సినిమాతో కృతి సనన్ రేంజ్ మరోస్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
కృతి సనన్ ఖాతాలో ప్రస్తుతం ఏడు సినిమాలు న్నాయి. ఆదిపురుష్, బేడియాలతో పాటు అక్షయ్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ అక్షయ్ పాండే, హౌజ్ ఫుల్ ఐదవ సీజన్, యాక్షన్ థ్రిల్లర్ గనపత్, ఎమోషనల్ డ్రామా మిమి, కామెడీ ఎంటర్టైనర్ హమ్ దో హమారే దో వంటి చిత్రాలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కృతి రానున్న రోజులలో బాలీవుడ్ను ఏలడం ఖాయంగా కనిపిస్తుంది.