శ్రీవారి ఖజానాకు రూ. 3,38,621 ఆదాయం
యాదాద్రి, ఏప్రిల్ 8: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామి అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు ఉదయం ఆలయాన్ని తెరిచి స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. తులసిదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ మండపంలో సుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గింది.
ఆదాయం రూ. 3,38,621
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి రూ. 3,38,621 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 20,332, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 10,400, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 1,800, క్యారీబ్యాగుల ద్వారా రూ. 840, వ్రతాల ద్వారా రూ. 17,500, కల్యాణకట్ట ద్వారా రూ. 17,960, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 2,04,800, వాహన పూజల ద్వారా రూ. 7,400, టోల్గేట్ ద్వారా రూ. 780, అన్నదాన విరాళం ద్వారా రూ. 4,117, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 26,832, యాదరుషి నిలయం ద్వారా రూ. 27,100, శివాలయం ద్వారా రూ. 800, పాతగుట్ట ద్వారా రూ. 7,100, ఇతర విభాగాలు రూ. 300తో కలిపి స్వామివారికి రూ. 3,38,621 ఆదాయం సమకూరింది.