జగిత్యాల : జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కరోనా కలకలం చెలరేగింది. 70 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 40 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాలనీ వాసులంతా ఇటీవల ఎల్లమ్మ బోనాల్లో పాల్గొన్నారు. కాలనీలో కరోనా పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి.