వాషింగ్టన్, ఏప్రిల్ 6: ఈ ఏడాదికిగాను భారత జీడీపీ వృద్ధిరేటు ఆకర్షణీయ రీతిలో 12.5 శాతంగా నమోదు కాగలదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. గతేడాది కరోనా తీవ్రతకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అల్లాడినా.. వృద్ధిరేటును చూసిన చైనా కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ప్రపంచ బ్యాంక్తో వార్షిక సమావేశాలకు ముందు ఐఎంఎఫ్ తన వార్షిక వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ను విడుదల చేసింది. ఇందులో వచ్చే ఏడాది దేశ జీడీపీ 6.9 శాతంగా ఉండొచ్చన్నది. ఇక ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రపంచ వృద్ధిరేటు 6 శాతం, 4.4 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ అన్నారు.