ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్ గ్రామ శివారులో పోలీసు వాహనం బోల్తాపడి ఎస్ఐకి గాయాలయ్యాయి. ఎస్ఐ రఘు తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వైపునకు పోలీస్ వాహనంలో డ్రైవర్తో కలిసి బయల్దేరాడు.
పిండిప్రోల్ శివారులో ఎదురుగా వచ్చిన ఐస్ క్రీం బండిని డ్రైవర్ తప్పించబోయి వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఎస్ఐకు స్పల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆయనను తిరుమలాయపాలెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి