తిరువనంతపురం : పెట్రోల్, డిజీల్ ధరలకు నిరసనగా వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆటోలో ప్రయాణించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రోజు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీమూమ్లో నిర్వహించిన ఎన్నికల సభకు.. వయనాడ్లోని కాల్పేట్ట హెలిప్యాడ్ నుంచి ఆటోలో బయల్దేరి వెళ్లారు. రాహుల్ ఆటోలో ప్రయాణించడంతో అందరూ షాక్ అయ్యారు. ఏప్రిల్ 6న కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.