మహబూబ్నగర్ : జిల్లాలోని మిడ్జిల్ ఎస్ఐ సురేష్ బాబుపై వేటు పడింది. సురేష్ బాబును మహబూబ్ నగర్ ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ రెమా రాజేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. బోయిన్పల్లి గ్రామానికి చెందిన శివ.. ఇటీవలే మిడ్జిల్ పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ కేసుతో పాటు ఇసుక అక్రమ రవాణా దందాకు సహకరించడానే ఫిర్యాదులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సురేష్ బాబును సస్పెన్షన్ చేయాలని నిర్ణయించారు. ఇటీవలే మహబూబ్నగర్ టూ టౌన్ సీఐ శ్రీనివాసాచారిపై అవినీతి ఆరోపణలు, మహిళలను వేధించాడనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.