హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైతాళికుడు, సామాజిక చరిత్రకారుడు, గోలకొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతిని (మే 28న) పురస్కరించుకొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తుకు 1944-46.. రెండేండ్లపాటు అధ్యక్షుడిగా సేవలందించిన అనుబంధంతో సురవరం పేరిట పరిషత్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.