దామెర, మార్చి 28 : మండలంలోని కోగిల్వాయిలో శ్రీచంద్రగిరి చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. డప్పు చప్పుళ్లు, వేదమంత్రాల మధ్య జరిగిన స్వామి కల్యాణాన్ని చూసేందుకు వరంగల్, హన్మకొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీదేవి-భూదేవి సహితంగా కొలువైన స్వామివారి ఆలయానికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జ్యోతి దంపతులు కుటుంబ సమేతంగా రాగా వారికి ఆలయ ప్రధానార్చకుడు దివి వెంకటజోగాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి తలంబ్రాలను సమర్పించగా, సర్పంచ్ గట్ల విష్ణువర్ధన్రెడ్డి దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం కల్యాణ తంతు అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీచెన్నకేశవస్వామికి భక్తులు మొక్కులు చెల్లించారు. భక్తుల కోసం గుట్టపై ఏర్పాటు చేసిన మహాఅన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీచంద్రగిరి చెన్నకేశవస్వామి ఆలయాన్ని తిరుపతి మాదిరిగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకొచ్చి, గుట్ట చుట్టూ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తామన్నారు. గీసుగొండ మండలంలోని ఏకవీర ఆలయం, నడికూడ మండలంలోని కోటగుళ్లు, దామెర మండలంలోని శ్రీచంద్రగిరి చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు, ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ గట్ల విష్ణువర్ధన్రెడ్డి, రఘుపతిరెడ్డి, గోవర్ధన్రెడ్డి, పిన్నోజు సుబ్రహ్మణ్యచారి, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, జడ్పీటీసీ గరిగె కల్పనాకృష్ణమూర్తి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బిల్లా రమణారెడ్డి, ఎంపీటీసీ సంగనబోయిన మౌనికాకిరణ్, మండల కోఆప్షన్ సభ్యులు అక్తర్, పీఏసీఎస్ డైరెక్టర్ గుండా చంద్రమోహన్, ఉపసర్పంచ్లు మెంతుల రాజు, గోల్కొండ సాంబయ్య, జాతర చైర్మన్ మౌటం రఘు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమలాకర్, ఎడ్ల రాము, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, అర్చకులు మురళీధరాచార్యులు, కేశవాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, అజయ్రెడ్డి పాల్గొన్నారు.