మరికల్, మార్చి 23 : ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పీఆర్సీని 30 శాతం ప్రకటించడంతో మంగళవారం టీ పీఆర్టీయూ ఆధ్వర్యంలో మండలంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులపై సీఎం కేసీఆర్కు ఉన్న అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. మరింత ఉత్సాహంతో తమ విధులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో టీ పీఆర్టీ యూ నాయకులు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టీ పీఆర్టీయూ ఆధ్వర్యంలో …
ధన్వాడ, మార్చి 23 : మండలంలో టీ పీఆర్టీయూ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పీఆ ర్సీ, ఉద్యోగ పదవీ విరమణ వయస్సు పెం చి సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపతిగా నిలిచిపోయారని తిమ్మారెడ్డి అన్నారు. కార్యక్రమంలో టీ పీఆర్టీయూ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ శెట్టి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీ నివాస్సాగర్, మండల కార్యదర్శి రవికుమార్, నాయకులు పాల్గొన్నారు.
‘సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం’
ధన్వాడ, మార్చి 23 : సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటామని కా ంట్రాక్ట్ అధ్యాపకుల జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్ అన్నారు. మండలంలో ని ప్రభుత్వ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలేజీల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులకు తెలంగాణ రాక ముందు రూ.18 వేలే ఇచ్చే వారని, తెలంగాణ వచ్చాక మొ దటిసారి పీఆర్సీతో రూ.60 వేలకు పెంచారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం పీఆర్సీ ఇస్తూ ప్రకటించడం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతోపాటుగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు పీఆర్సీ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు తొలి దైవం సీఎం కేసీఆరే అన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, కోశాధికారి సత్యనారాయణ, సభ్యులు సాంబశివు డు, గోపీ, బాలరాజు పాల్గొన్నారు.