జాతీయ అవార్డు గెలుచుకున్న తాజా కంగనా రనౌత్ తన కృతజ్ఞతను తెలియజేసేందుకు ఒక వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు. మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పంగా చిత్రాలలో ఆమె నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గ్రహీతగా కేంద్రం ప్రకటించింది. వాస్తవానికి గత ఏడాది మేలో జరుగాల్సిన అవార్డులు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యమయ్యాయి.
ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు కంగనా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీకి దర్శకత్వం వహించానని, ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసిన కేవీ విజేంద్ర ప్రసాద్ సహా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సినిమాకు సంభాషణలు రాసిన ప్రసూన్ జోషి, సంగీత దర్శకుడు శంకర్-ఎహ్సాన్-లాయ్, నిర్మాత కమల్ జైన్, సహనటులు అంకితా లోఖండే, డానీ డెంజోంగ్పా తదితరులు ఉన్నారు.
“ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రతిఒక్కరికీ చాలా ధన్యవాదాలు” అని ఆమె చెప్పారు పంగా సినిమా దర్శకుడు అశ్విని అయ్యర్ తివారీ, చిత్ర బృందానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. నేషనల్ అవార్డ్స్ జ్యూరీతోపాటు అభిమానులు, కుటుంబ సభ్యులు, తన వ్యక్తిగత సిబ్బందికి కూడా కంగనా కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కంగనా రనౌత్కు నాలుగవ జాతీయ అవార్డు. 2008 లో ఆమె ఫ్యాషన్ కొరకు ఉత్తమ సహాయ నటిగా, ఆ తర్వాత క్వీన్ (2014), తనూ వెడ్స్ మను రిటర్న్స్ (2015) చిత్రాలకు ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నది.
ఆ దేశం అమ్మాయిలను వివాహమాడటంపై సౌదీ నిషేధం..!
ఆస్ట్రేలియాలో వరదలు.. 100 ఏండ్ల రికార్డు బద్దలు
భక్తులకు శుభవార్త : రెండేండ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర
ఆస్కార్ నామినేషన్స్.. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే రేసులో ‘ది వైట్ టైగర్’
చైనా వ్యాక్సిన్ను తిరస్కరిస్తున్న తైవాన్ ప్రజలు.. ఎందుకంటే..?
బెంగాల్, అసోం ఎన్నికల బరిలో జేడీయూ
109 ఏండ్ల రాష్ట్రంగా బిహార్.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.