చెన్నై: ఏసీలు, రిఫ్రిజిరేటర్ల తయారీ సంస్థ బ్లూస్టార్..వినియోగదారులకు మరోసారి షాకివ్వబోతున్నది. వచ్చేనెల నుంచి అన్ని రకాల ఉత్పత్తులను ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ముడి సరుకులు, రవాణా చార్జిలు అధికమవడంతో ధరలు పెంచకతప్పదని కంపెనీ ఎండీ బీ త్యాగరాజన్ స్పష్టంచేశారు. మార్కెట్లోకి నూతన శ్రేణి ఏసీలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏసీల మార్కెట్ 15-20 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నదన్నారు. నూతన శ్రేణి ఏసీలు రూ.18,990 ప్రారంభ ధరలో లభించనున్నాయి. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ కోసం రెండో విడుతలో మరో రూ.270 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.