హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం 799 బ్యాలెట్ బాక్స్ల్లో 450 బాక్స్లను తెరిచి సిబ్బంది కట్టలు కట్టారు. మరో 350 బ్యాలెట్ బ్యాక్స్లు తెరిచాకే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి తర్వాత తొలిరౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. రేపు ఉదయానికి తొలిరౌండ్ ఫలితం రానుంది. మొత్తం ఆరురౌండ్లలో ఒక్కో రౌండ్కు 56 వేల ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. శుక్రవారం సాయంత్రానికి విజయంపై స్పష్టత వచ్చే అవకాశముంది.