ముంబై కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్మన్ పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న షా ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగుతూ భారీ ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో దిగ్గజ బ్యాట్స్మెన్లకు సాధ్యం కానీ రికార్డును షా సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఒకే ఎడిషన్లో 800 పరుగులకు పైగా నమోదు చేసిన తొలి ఆటగాడిగా పృథ్వీ రికార్డు నెలకొల్పాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ట్రోఫీ ఫైనల్లో భాగంగా ఉత్తర్ప్రదేశ్తో మ్యాచ్లో షా(73) ఈ ఘనత అందుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2017-18 సీజన్లో మయాంక్ అగర్వాల్ 723 పరుగుల రికార్డును తాజాగా షా బ్రేక్ చేశాడు. పృథ్వీ ప్రస్తుత సీజన్లో ఇప్పటికే నాలుగు శతకాలు నమోదు చేశాడు.