న్యూఢిల్లీ : ప్రభుత్వం ఇస్తున్న గ్యాస్ సబ్సిడీ మీకు అందడం లేదా..? అయితే, అందుకు గ్యాస్ కనెక్షన్తో ఆధార్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. సిలిండర్పై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఎల్పీజీ సబ్సిడీ ప్రయోజనాన్ని పొందడానికి ఆధార్ను ఎల్పీజీ కనెక్షన్తో అనుసంధానించడం తప్పనిసరి చేశారు. గ్యాస్ కనెక్షన్తో ఆధార్ను లింక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వెబ్సైట్ ద్వారా, కాల్ చేయడం ద్వారా, ఐవీఆర్ఎస్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా వీటిని లింక్ చేయవచ్చు.
ఆన్లైన్లో ఆధార్ను లింక్ చేయడం ఎలాగంటే..
Rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeedingpds.aspx వెబ్సైట్కి వెళ్లి అవసరమైన సమాచారాన్ని పూరించండి.
‘బెనిఫిట్ టైప్’ ను ఎల్పీజీగా ఎంచుకుని, ఆపై ఎల్పీజీ కనెక్షన్ ప్రకారం పథకం పేరును పేర్కొనాలి. భారత్ గ్యాస్ కనెక్షన్ కోసం ‘బీపీసీఎల్’, ఇండానే గ్యాస్ కనెక్షన్ కోసం ‘ఐఓసీఎల్’ అని పేర్కొనాలి.
డ్రాప్-డౌన్ జాబితా నుంచి ‘డిస్ట్రిబ్యూటర్ నేమ్’ ఎంచుకోవాలి. ఎల్పీజీ వినియోగదారు సంఖ్యను నమోదు చేయాలి. అనంతరం
మొబైల్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా, ఆధార్ నంబర్ను నమోదు చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలో వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత దీని వివరాలను సంబంధిత అధికారి ధ్రువీకరిస్తారు. దాని సమాచారం రిజిస్టర్డ్ నంబర్తో పాటు ఐడీకి పంపిస్తారు.
ఎస్ఎంఎస్ ద్వారా లింక్ చేయడం..
ఎల్పీసీ కనెక్షన్కు ఆధార్ను లింక్ చేయడానికి ఎల్పీజీ సర్వీస్ ప్రొవైడర్కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా చేసుకునే వెసులుబాటు ఉన్నది. మొబైల్ నంబర్ను ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్తో రిజిస్టర్ చేసి, ఆపై రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపాలి. పంపిణీదారుల వెబ్సైట్ నుంచి ఈ సంఖ్య కనుగొనబడుతుంది.
ఐవీఆర్ఎస్ ద్వారా లింక్ చేయడం..
ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) ద్వారా కూడా ఎల్పీజీ కనెక్షన్లకు ఆధార్ నంబర్ను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే వీలున్నది. ప్రతి జిల్లాకు ప్రత్యేక ఐవీఆర్ఎస్ ఉంటుంది. వినియోగదారులు సంస్థ చేసిన జాబితా నుంచి ఆయా జిల్లాకు సంబంధించిన నంబర్ను పొందవచ్చు.