ఈస్తోనియా రాయబారితో సీఎస్ సోమేశ్కుమార్
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఈస్తోనియా ప్రతినిధి బృందానికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ విజ్ఞప్తి చేశారు. బీఆర్కేఆర్ భవన్లో ఈస్తోనియా రాయబారి కట్రిన్ కివి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జూయి హైయో.. సోమేశ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రొటోకాల్ జాయింట్ సెక్రటరీ అర్విందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సెర్ప్, మెప్మా కార్యక్రమాలపై వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, అధికారులతో జరిగిన సమీక్షలో సీఎస్ పాల్గొన్నారు. మహిళల జీవనోపాధిలో మార్పు తేవడానికి వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై దృష్టిసారించాలని ఆదేశించారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో ఐటీ వినియోగం, సామర్థ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్, కన్వర్జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఐటీ వినియోగం ద్వారా స్వయంసహాయక గ్రూపులకు నిరంతర సేవలందించాలని, ప్రతి గ్రూప్కు బ్యాంక్ లింకేజీ అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు