కావలసిన పదార్థాలు
పెసరపప్పు: ఒక కప్పు, పచ్చిమిర్చి: ఆరు, ఇంగువ: చిటికెడు, పచ్చికొబ్బరి తురుము: 2 టీ స్పూన్స్, వంటసోడా: 1/4 టీ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: కొద్దిగా, పెరుగు: అర కప్పు
తయారీ విధానం
ముందుగా పెసరపప్పును మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. అలాగే, నానబెట్టిన పెసరపప్పును కూడా నీళ్లు లేకుండా విడిగా రుబ్బుకుని పెట్టుకోవాలి. రెండిటినీ పెరుగు వేస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకొని కొద్దిగా వంటసోడా వేయాలి. పిండి మిశ్రమం బాగా కలుపుతూ కొద్దికొద్దిగా తీసుకుని ఇడ్లీ రేకుల్లో వేసి ఉడికించాలి. అంతే! ఎంతో రుచికరమైన పెసరపప్పు ఇడ్లీ రెడీ!