ఏడు పదుల వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆరోగ్యం సహకరించకపోవడం వలన తాను రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్న ప్రకటించారు. ఇక సినిమాల సంగతి ఏంటనే విషయంపై క్లారిటీ లేదు. అయితే రజనీకాంత్ కరోనాకు ముందు అన్నాత్తె అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ వలన ఆగిపోయిన సినిమాను ఇటీవల తిరిగి మొదలు పెట్టారు. ఆ సమయంలో తలైవా అస్వస్థతకు గురి కావడం, షూటింగ్ను కొన్నాళ్లు వాయిదా వేయడం జరిగింది.
ఇటీవల అన్నాత్తె చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో అతి త్వరలోనే అన్నాత్తె షూటింగ్ మొదలు కానుందని ఫ్యాన్స్ భావించారు. తమిళనాడు ఎలక్షన్స్ తర్వాత స్టార్ కానుందని కొందరంటే, మరకొందరేమో మార్చి నుండి రీస్టార్ట్ కానుందని చెప్పుకొచ్చారు. తాజా సమాచారం ప్రకారం మార్చి 15 నుండి చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో పాల్గొననున్న రజనీకాంత్ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు జా కీ ష్రాఫ్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు.