సంగారెడ్డి, జూలై 27 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలన్న లక్ష్యంతో గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళా సంఘాలకు ప్రభుత్వం స్త్రీనిధి రుణాలు అందజేస్తున్నది. మహిళా సంఘాల గ్రూపులోని సభ్యులందరికీ పావలా వడ్డీ కింద వ్యక్తిగత, వ్యాపార రుణాలను రూ.4వేల నుంచి రూ. 5లక్షల వరకు అందజేస్తున్నది. కిరాణం దుకాణా లు, బేకరీలు, టైలరింగ్ షాపులు రకరకాల వ్యాపారుల తో వీటితోపాటు డెయిరీ, ఫౌల్ట్రీ, పందిరి పంటలసాగు, గ్రీన్హౌస్కు రుణాలను ఇస్తున్నది.
25వేలకు పైగా మహిళా సంఘాలు..
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 25 వేలకు పైగా మహిళా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో 3 లక్షల వరకు మహిళా సభ్యులు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో జిల్లాలో స్త్రీ నిధి ద్వారా 7456 గ్రూపుల్లోని 42,339 మహిళలకు రూ.121.63 కోట్ల రుణా లు పంపిణీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి ద్వారా రూ.177.45 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 1073 ఎస్హెచ్జీ గ్రూపుల్లోని 2942 మంది మహిళా సభ్యులకు రూ.11.29 కోట్ల రుణాలు పంపిణీ చేస్తున్నారు.
వ్యాపారం, వ్యవసాయం, డెయిరీకి రుణాలు
స్త్రీ నిధి ద్వారా ఎస్హెచ్జీ మహిళలకు వ్యాపారాలు, వ్యవసాయం, డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందజేస్తున్నది. స్త్రీ నిధి ద్వారా వేర్వేరు స్కీంల ద్వారా వ్యాపారాలు, కొనుగోలు చేసుకునేందుకు రుణాలు ఇస్తున్నారు. సువిధ స్కీం ద్వారా అర్హులైన ఎస్హెచ్జీ మహిళలకు రూ.4వేల నుంచి రూ.40 వేల వరకు రుణా లు మంజూరు చేస్తారు. రుణాలు తీసుకున్న ఎస్హెచ్జీ మహిళలు డబ్బులను రెండేండ్లలో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. అక్షయ స్కీం ద్వారా రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందజేస్తారు. ఈ స్కీం ద్వారా రుణం తీసుకున్న మహిళలు వాయిదా డబ్బులను నాలుగు సంవత్సరాల్లో చెల్లించాలి. సౌభాగ్య స్కీం ద్వారా ఎస్హెచ్జీ మహిళలకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తారు. 60 వాయిదాల్లో ఈ డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా స్పెషల్ స్కీంలు ఉన్నాయి.
స్పెషల్ స్కీం మొదటి కేటగిరీలో డెయిరీ యూనిట్లు మంజూరు చేస్తారు. మహిళా సంఘాలు గేదెలు కొనుగోలు చేసి పాల వ్యాపారం చేసుకునేందుకు స్త్రీనిధి ద్వారా రుణాలు అందజేస్తారు. డెయి రీ స్కీం ద్వారా గేదెల కొనుగోలుకు రూ.92వేలు అందజేస్తారు. ఈ ఏడాది 3వేల డెయిరీ యూనిట్లకు స్త్రీ నిధి ద్వారా రుణాలు మంజూరు చేయనున్నారు. డెయిరీ యూనిట్ స్కీంలో ఇప్పటి వరకు 739 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఆగస్టు 10 తర్వాత ఎంపికైన లబ్ధిదారులకు డెయిరీ స్కీం ద్వారా రుణాలను పం పిణీ చేయనున్నారు. ఈ స్పెషల్ స్కీం రెండో కేటగిరీలో పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటుకు రూ.3 లక్షలు, ఈ-ఆటో కొనుగోలుకు రూ.3లక్షలు, పందిరి పంటలకు సాగుకు రూ. లక్షలు, గ్రీన్హౌస్ ఏర్పాటుకు రూ.లక్షలు, బేకరీలు, పచ్చళ్ల తయారీ తదితర ఆహార ఉత్పత్తుల వ్యాపారాలు చేసుకునేందుకు రూ.5 లక్షల వరకు రుణాలు అందజేయనున్నారు. మహిళా సంఘాల్లోని మహిళల తమ ఇండ్లను మరమ్మతు చేసుకునేందుకు సైతం రూ.75వేల రుణం పొందవచ్చు. అలాగే ద్విచక్ర వాహనాల కొనుగోలుకు సభ్యులకు రూ.75వేలు ఇస్తారు.
లక్ష్యం మేరకు రుణాల పంపిణీపై డీఆర్డీవో దృష్టి
జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో లక్ష్యం మేరకు స్త్రీ నిధి రుణాలు పంపిణీ చేసేందుకు డీఆర్డీవో సిద్ధమవుతున్నది. ఈ యేడు రూ.177.45 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని డీఆర్డీవో లక్ష్యంగా పెట్టుకుంది. మండలాల వారీగా స్త్రీ నిధి కోఆర్డినేటర్లకు లక్ష్యాలను కేటాయించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 1073 ఎస్హెచ్జీ గ్రూపుల్లోని 2942 మంది మహిళా సభ్యులకు రూ.11.29 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియటానికి ముందే లక్ష్యం మేరకు వందశాతం స్త్రీ నిధి రుణాలు పంపిణీ చేస్తామని డీఆర్డీవో అధికారులు చెబుతున్నారు.