జహీరాబాద్, జూలై 22 : పేదలకు కార్పొరేటు వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయం లో పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. జహీరాబాద్ పట్టణంలోని జగమ్మకు రూ. 29 వేలు, నర్సింలుకు రూ. 16,500 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో అత్మ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జి.గుండప్ప, కేతకీ సంగమేశ్వర దేవాలయం చైర్మన్ వెంకటేశంతో పాటు పలువురు ఉన్నారు.
కంగ్టి మండలంలో…
కంగ్టి మండలంలోని రాం సింగ్ తండాకు చెందిన రుక్కుబాయి, నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి తండాకు చెందిన గోపాల్నాయక్లకు నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కొన్ని నెలల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో వైద్య చికిత్సలు చేయించుకోగా, వీరిద్దరూ ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రుక్కుబాయికి రూ. 1,78,500, గోపాల్నాయక్కు రూ.20500 సహాయనిధి మంజూరుచేయగా, ఎమ్మెల్యే వారికి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అభిషేక్ శెట్కార్, రాజుపాటిల్, జాదవ్ కిరణ్, బిక్కుబాయి, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నదని జాగృతి జిల్లా అధ్యక్షుడు దండు ప్రవీణ్రావు తెలిపారు. గురువారం హత్నూర మండలం ఎల్లమ్మగూడ గ్రామానికి చెందిన కుమ్మరి ఆదర్శ్ కుమార్కు ప్రభుత్వం మంజూరుచేసిన సీఎంఆర్ఎఫ్ రూ.60వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖానలో చికిత్సపొంది ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునే పేదలకు అండగా ఉండేందుకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేశ్గౌడ్, జాగృతి నాయకుడు శేఖర్లు ఉన్నారు.