సంగారెడ్డి, సెప్టెంబర్ 27 : తెలంగాణ స్వరాష్ట్ర తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎస్పీ రమణకుమార్ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా సోమవారం పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొ మురంభీం జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించిన బాపూజీ స్వాతంత్య్రోద్యమంతోపాటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రజలను చైతన్యం చేశారని చెప్పా రు. బాల్యంలోనే బాపూజీ తల్లి మరణించినా పట్టువదలకుండా లా పూర్తి చేసి న్యాయవాదిగా పేదల తరఫున వాదించేవారని గుర్తుచేశారు. నాల్గో తరగతి చదువుతున్న సమయంలో మహాత్మాగాంధీ చంద్రాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరై స్వాతంత్య్రోద్యమానికి ఆకర్షితుడయ్యారన్నారు. అప్పటి నుంచే గాం ధీజీలా టోపి ధరించడం ప్రారంభించారని తెలిపారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తన ఇల్లు జలదృశ్యం నుంచే టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని ఎస్పీ గుర్తు చేశారు. అలాంటి మహానాయకుని అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడుస్తూ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సృజన, ఏవో అనిత, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్నాయుడు, సంగారెడ్డి డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఆర్ఐలు హరిలాల్, డానియల్, కృష్ణ, డీపీవో సూపరింటెండెంట్లు వెంకటేశం, వాల్యానాయక్, ఎస్బీ ఎస్సై యాదవరెడ్డి, డీపీవో అధ్యక్షుడు నాగరాజు, సలీమ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గారెడ్డి పాల్గొన్నారు.