అందోల్, జూలై 23: టీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నేడు నిర్వహించనున్న ముక్కోటి వృక్షార్చన కార్యమ్రంలో పార్టీ శ్రేణులు పాల్గొన్ని పెద్ద ఎత్తున మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్లు, బొకేలు, ఫ్లెక్లీలు లాంటి ఆడంబరాలకు పోకుండా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. జోగిపేటలో మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, పలువురు కౌన్సిలర్లు నేడు న్విహించనున్న వృక్షార్చనలో భాగం గా ఏర్పాట్లను పరిశీలించా రు. నేడు నిర్వహించనున్న కేటీఆర్ బర్త్డే వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నాలని మున్సిపల్, ఏఎంసీ చైర్మన్లు మల్లయ్య, మల్లికార్జున్గుప్తా, పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి..
రాష్ట్ర ఐటీ,మున్సిపాల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బల్దియా ఉపకమిషనర్ బాలయ్య తెలిపారు. శుక్రవారం భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీలో వృక్షోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పటాన్చెరులో 10వేలు, భారతీనగర్లో 4వేలు, ఆర్సీపురంలో 2వేల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. ఆరోవార్డు బాలాజీనగర్, కేబీఆర్ కాలనీలో శుక్రవారం బొల్లారం మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్ కాలనీబాట కార్యక్రమం భాగంగా పర్యటించారు.
సంగాపూర్ గ్రామంలో ..
టీఆర్ఎస్ కార్యనిర్వాహక ఆధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని నేడు నిర్వహించే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సంగాపూర్ గ్రామంలో ముక్కోటి వృక్షార్చన కార్యాక్రమంలో 5 వేలమొక్కలు నాటేందుకు గుంతలు తీశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సుప్రియ ఉన్నారు.