కల్హేర్/నారాయణఖేడ్/సిర్గాపూర్, జూన్ 17: “కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కరెంటు కష్టాలతో పంటలు పండగ కర్షకులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెప్పపాటు కరెంటు కోత లేకుండా నాణ్యమైన 24గంటల కరెంటు అందించి, రైతన్నలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నది.” అని ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. గురువారం కల్హేర్, సిర్గాపూర్ మండలం బొక్కస్గావ్, నారాయణఖేడ్లో జొన్నల కొనుగోలు కేంద్రాలు, బొక్కస్గావ్లో నూతన గ్రామ పంచాయతీ, వైకుంఠధామాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏండ్ల నాటినుంచి పాలించిన పాలకులు చేపట్టిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఆరేండ్లల్లోనే చేశారని కొనియాడారు. యాసంగి రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధరను అందించి ఆర్థికంగా చేయూతనందించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. స్పందించిన సీఎం ఉన్నతాధికారులతో చర్చించి ఉత్తర్వులు జారీ చేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గంలో తాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉండేదని, ఎమ్మెల్యేగా భూపాల్రెడ్డి సమస్యలను పరిష్కరించారని ఎంపీ తెలిపారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మిషన్ కాకతీయ కింద రూ.80 కోట్లతో మరమ్మతులు చేపట్టామన్నారు. నూతనంగా 8 చెరువులు మంజూరు అయ్యాయన్నారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో నియోజకవర్గంలో లక్షా 35వేల ఎకరాలకు సాగునీరందించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నదన్నారు. నల్లవాగు ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు ప్రభుత్వ హయాంలోనే నీరందయన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీలు నర్సింహారెడ్డి, రాఘవరెడ్డి, రాజునాయక్, ఎంపీపీలు గుర్రపు సుశీల, లక్ష్మీబాయి రవీందర్నాయక్, మహిపాల్రెడ్డి, జిల్లా కోఆప్షన్ మెంబర్ అలీ, డీసీసీబీ డైరెక్టర్లు నరేందర్రెడ్డి, గుండు వెంకట్రాంలు, ఎంపీపీ ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్లు గంగారెడ్డి, సంగారెడ్డి, కృష్ణాగౌడ్, ఏడీఏ కరుణాకర్రెడ్డి, తహసీల్దార్ జైరాం, ఏవో శశాంక్, పార్టీ మండలాధ్యక్షులు సాయిరెడ్డి, నారాయణరావు, సంజీవ్రావు, మండల కో ఆప్షన్ మెంబర్ గణి, రమేశ్ చౌహాన్, సత్యపాల్రెడ్డి, అభిషేక్ శెట్కార్, ప్రభాకర్, పరమేశ్, వినయ్కుమార్, కృష్ణమూర్తి, ఆయా గ్రామాల సర్పంచ్లు లచ్చవ్వ, రవీందర్రెడ్డి, శ్రావణ్కుమార్, విజయ్కుమార్, ఎంపీటీసీ సంగప్ప, ఏఈవోలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.