హైదరాబాద్ (నమస్తే తెలంగాణ ) : మూడు, ఐదేండ్ల న్యాయ కోర్సులతో పాటు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్సెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్లు ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఆగస్టు 23, 24 తేదీల్లో లాసెట్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. మూడేండ్ల లా కోర్సుకు భారీగా దరఖాస్తులు రావడంతో రెండు సెషన్లల్లో పరీక్షలను నిర్వహించడంతో అధికారులు నార్మలైజేషన్ను చేపట్టడంతో ఫలితాలు కాస్త ఆలస్యమయ్యాయి. ఫలితాలు https://lawcet.tsche.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Good news | ప్రవేశ పరీక్ష లేకుండానే ‘ఇగ్నో’లో ఎంబీఏ
మనం మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలి.. ప్రభుత్వం మాట ఇదీ!
రైతులు, కూలీలను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి కేటీఆర్