వేములవాడ టౌన్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. రాజన్న ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలను కూడా మూసివేశామని, దర్శనాల కోసం భక్తులు ఎవరూ రావద్దని ఈవో కృష్ణప్రసాద్ సూచించారు.
శంకరజయంతి ఉత్సవాలు ప్రారంభం
రాజన్న ఆలయంలో ఐదురోజులపాటు జరిగే శంకరజయంతి ఉత్సవాలను బుధవారం ప్రారంభించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం రాజరాజేశ్వరస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శంకరమఠంలో స్వామివారికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.