గతేడాది సెప్టెంబర్ 4న స్థానికంగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో బాలిక తల్లి ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహ్మద్ యూసుఫ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
4 నెలల్లోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చార్జీషీట్ను కోర్టులో దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి మొదటి అదనపు సెషన్స్ జడ్జి కుంచల సునీత నిందితుడికి 20ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
జరిమానా చెల్లించని పక్షంలో మరో 6నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు.