లక్నో : ఓ జడ్జికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. కింది అంతస్తు నుంచి పై అంతస్తుకు లిఫ్ట్లో వెళ్తుండగా సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చిన జడ్జికి వైద్యులు ఎవరూ కూడా కనబడలేదు. ఈ క్రమంలో సదరు జడ్జి తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యాడు.
కాన్పూర్ జిల్లా కోర్టు జడ్జి ఆర్పీ సింగ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనిల్ మిశ్రాతో కలిసి నార్నియా ప్రభుత్వ ఆస్పత్రికి బుధవారం వెళ్లాడు. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత లిఫ్ట్లో ప్రయాణించిన జడ్జికి తీవ్ర అంతరాయం కలిగింది. ఆ లిఫ్ట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మధ్యలోనే ఆగిపోయింది. కొద్ది సేపటి తర్వాత లిఫ్ట్ తెరుచుకోవడంతో బయటకు వచ్చాడు. ఇక వార్డుల్లో డాక్టర్లు లేకపోవడంతో జడ్జి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా రోగుల బాధలను ఆయన చూసి చలించిపోయారు. విధుల్లో లేని డాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనిల్ మిశ్రాకు ఆదేశించడంతో పంకీ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాన్పూర్ పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. నార్నియా మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులు, ఇతర సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.