వాహన ధరలు రూ.22,500 వరకు పెంపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) షాకింగ్ ప్రకటన చేసింది. తమ కార్లలో చాలా మోడళ్ల ధరలను రూ.22,500 మేరకు పెంచుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల వల్ల కంపెనీపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఈ చర్య చేపడుతున్నామని, సెలెరియో, స్విఫ్ట్ కార్లు మినహా మిగిలిన అన్ని మోడళ్ల ధరలు పెంచుతున్నామని స్పష్టం చేసింది. దీంతో ఎక్స్-షోరూమ్ ధరలు సగటున 1.6 శాతం వరకు పెరుగుతాయని, కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని రెగ్యులేటరీ ఫైలింగ్లో మారుతీ సుజుకీ వివరించింది.
ఇవీ కూడా చదవండీ…
మారుతి కారు కొంటే షాక్.. 4 నెలల్లో 56వేలు పెంపు
వజ్రాలకు కొవిడ్ దెబ్బ.. అదేం లేదన్న సూరత్ ఇండస్ట్రీ
నీరవ్ మోదీ అప్పగింతకు బ్రిటన్ హోంమంత్రి గ్రీన్ సిగ్నల్