గుర్తించిన కొత్త తెలంగాణ చారిత్రక బృందం
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కొత్త తెలంగాణ చరిత్రబృందం వేములవాడలో బుద్ధమూర్తి ఆనవాళ్లను గుర్తించింది. ఆ బృందం సభ్యుడు సామలేటి మహేశ్ వేములవాడ దేవాలయాలను పరిశీలించినప్పుడు ఆలయ కుడ్యాల మీద చెక్కిన బౌద్ధజాతక కథల్లోని కథా దృశ్యాలు కొన్ని బయటపడ్డాయి. ఇవే పంచతంత్ర కథలుగా ప్రసిద్ధమయ్యాయి. (బుద్ధితక్కువ) తాబేలును మో స్తూ ఎగురుతున్న కొంగలు, మొసలిమీద కూర్చొని ఏటి లో ప్రయాణిస్తున్న కోతి(తియ్యటి గుండెకాయ) కథా దృశ్యాలు ఉన్నాయి. వీటితోపాటు బుద్ధుడు నిర్యాణాన్ని చెక్కిన ఉల్బణ(అర్ధ) శిల్పాన్ని గుర్తించా రు. రావి చెట్టు కింద కుడిచేతిని తలకింద పెట్టుకొని, కుడివైపునకు తిరిగి నిర్యాణం చెందిన బుద్ధుని అర్ధశిల్పం ఉన్నది. బోధిచెట్టు కింద జ్ఞానోదయం పొం దిన బుద్ధుడు రావిచెట్టు (బోధివృక్షం) కింద నిర్యా ణం పొందినట్టు చెక్కిన ఈ శిల్పం అరుదైందని మహేశ్ తెలిపారు. ఇలాంటి బుద్ధుని నిర్యాణశిల్పం తెలంగాణలోనే మొదటిదని, అది కూడా వేములవాడ జైన స్థావరంలో లభించడం విశేషమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బుధవారం విడుదలచేశారు. వేములవాడ ప్రాంతాన్ని పా లించిన చాళుక్యులు జైనమతాభిమానులు కావడం తో ఇక్కడి దేవాలయాల్లో జైన శాసనాలు, జైన తీర్థంకరులు, జైన శాసన దేవతల శిల్పాలు ఉన్నాయి. చాళుక్యుల పిదప శైవమతం స్వీకరించిన కాకతీయు ల ఏలుబడిలో ఇక్కడి దేవాలయాలు శివాలయాలుగా పరివర్తనం చెందాయి. అందుకే వేములవాడలో బౌద్ధం ఉండేదని చరిత్రకారుల సందేహం.