20% వరకు పెరగనున్న వేతనాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఉద్యోగులకు ఈవారంలోనే శుభవార్త అందనున్నది. గత నాలుగేండ్లుగా వాయిదా పడుతూ వస్తున్న వేతన పెంపుపై ఈ వారం చివర్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేతన పెంపు విషయంపై ఎల్ఐసీ నాయకత్వం ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు తెలుస్తున్నది. కంపెనీ చైర్మన్ ఎంఆర్ కుమార్ ఇటీవల వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుతున్నాయి. వేతన పెంపు 18.5 శాతం నుంచి 20 శాతం మధ్యలో ఉండనున్నట్లు తెలుస్తున్నది. ఆగస్టు 1, 2017 నుంచి ఉద్యోగుల వేతనాలు పెంచాల్సి ఉన్నది. వేతన పెంపు నిర్ణయం వాయిదా పడటం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.