ఆమనగల్లు : మాడ్గుల మండలంలోని కోలుకులపల్లి గేట్ సమీపంలో సాగర్ హైవే పై రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిరాం బుధవారం మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి గ్రామానికి చెందిన సాయిరాం తన ద్వీచక్రవాహనం పై హైదరాబాద్కు వ్యక్తిగత పని నిమత్తం కొండమల్లేపల్లి వస్తున్నాడు. అదే సమయంలో చాకలిశేరిపల్లి గ్రామం నుంచి టిప్పర్ వాహనం సాగర్ హైవే పైకి వచ్చింది. దీంతో ద్వీచక్రవాహనం కంట్రోల్ కాకపోవడంతో సాయిరాం టిప్పర్ను ఢీకొట్టాడు. దీంతో సాయిరాం తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుని చికిత్స నిమిత్తం మాల్కు తరలించారు. ప్రథమ చికిత్సనంతరం పరిస్థితి విషమించడంతో మేరుగైన వైద్యం కోసం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యలో సాయిరాం మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడు తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.