హైదరాబాద్ : నగరంలోని మణికొండ ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారీ పడి యువకుడు మృతి చెందాడు. మణికొండకు చెందిన సుజిత్ (32) ఈ ఉదయం భవనం రెండో అంతస్తులో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ జారిపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ సాయంత్రం మృతి చెందాడు. కుటుంబీ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.