ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో ఆదివారం ఘనంగా నూలు పూర్ణిమ వేడుకలు నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞాలను చేపట్టారు. అనంతరం ఆలయంలో గాయత్రీధారణ కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగింది. ఉత్సవాలను తిలకించడానికి పట్టణంతో పాటుగా మండలంలోని పలు గ్రామాల నుంచి పద్మశాలీలు తరలివచ్చి వేడుకలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో భక్తులకు అన్నధానం చేశారు.
కాటమేశ్వర స్వామి ఆలయంలో దేవతా మూర్తుల ప్రతిష్ఠపాన
పట్టణంలో కాటమేశ్వర స్వామి ఆలయంలో దేవతామూర్తుల ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం గోపూజ, మహాగణపతి, లక్ష్మిపూజ, అఖండ దీపారాదన నిర్వహించారు. వేడుకల్లో పలువురు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకొన్నారు.