యాచారం : మండలంలోని నందివనపర్తి గ్రామంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి.
అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కులు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉదయశ్రీ, ఉపసర్పంచ్ గోవర్ధన్రెడ్డి, బీఎన్రెడ్డి ట్రస్టు చైర్మన్ శేఖర్రెడ్డి, కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు కొండాపురం శ్రీశైలం పాల్గొన్నారు.