కాన్పూర్ : ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో భక్తులతో వెళ్తున్న ఓ డీసీఎం వ్యాను బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు. భక్తులతో వెళ్తున్న డీసీఎం వ్యాను బ్యాలెన్స్ తప్పి రోడ్డు వారగా ఉన్న లోయలాంటి ప్రదేశంలో పడిపోయింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక దవఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారంతా పిన్హాట్-ఆగ్రా నుంచి బయల్దేరి లఖ్నదేవి ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులు అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను బయటకు తీయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రమాదంలో ముప్పై మందికి పైగా గాయపడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
గ్రామ బద్పురా ప్రాంతంలోని కసౌవా వద్ద డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పిపోయింది. దాంతో రోడ్డు పక్కన కందకంలో పడిపోయింది. కందకంలో పడిపోయి తీవ్రంగా గాయపడిన వారి అరుపులు కేకలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. వీరి ఆర్తనాదాలు విని గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం గ్రామస్తుల సమాచారం మేరకు బాద్పురా ఇన్చార్జి పోలీస్స్టేషన్ సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే గాయపడిన వారిని దవాఖానకు తరలించారు.
ఎస్ఎస్పి డాక్టర్ బ్రజేష్ కుమార్ సింగ్ కూడా సమాచారం అందుకున సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తాడును ఉపయోగించి కందకంలో పడిపోయిన వ్యానును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కందకంలో నుంచి బయటకు తీసిన పలువురిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి పంపారు. ఈ ఘటనలో పది మంది మరణించారని, సుమారు మూడు డజన్ల మంది గాయపడ్డారని ఎస్ఎస్పి డాక్టర్ బ్రజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ప్రజలందరూ పిన్హాట్-ఆగ్రా నుండి లఖ్నదేవి ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదని తెలిపారు.
డైనోసార్ల కలిసి తిరిగిన ఉడుమును కనుగొన్న శాస్త్రవేత్తలు
కొవిడ్తో నటుడు సతీష్ కౌల్ కన్నుమూత
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరిన ముగ్గురు వ్యోమగాములు
కొవిడ్ వ్యాక్సిన్కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..
గిన్నిస్ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
భారత్లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..