మాదాపూర్ : శేరిలింగంపల్లిని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ( Mla Gandhi) అన్నారు. మాదాపూర్లోని ఆదిత్యానగర్ కాలనీలో రూ. 43 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాపూర్(Madhapur) డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.
ప్రజలకు ట్రాఫిక్(Traffic) రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఈద్గా(Idga) ను పరిశీలించి ఈద్గా అభివృద్ధికి తమవంతు సహయ సహకారాలు అందిస్తామన్నారు.
కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు సంబంధిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏఈ ప్రశాంత్, జలమండలి డీజీఎం శరత్రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.