తాండూరు : తాండూరు అభివృద్ధే లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 13, 26, 27, 28, 31, 32, 33, 34, 35, 36 వార్డుల్లో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, కౌన్సిలర్లు, అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. నేరుగా ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ అందిస్తున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయనే విషయాలను పరిశీలించారు. వర్షంతో రోడ్లు నీటి కుంటలుగా మారుతున్న సంఘటనలు పరిశీలించారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డుల పర్యటనకు పార్టీలకు అతీతంగా సహకరించిన మున్సిపల్ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తమతో వార్డుల్లో పర్యటించి సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. వార్డు పర్యటనలో తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. తాండూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపల్గా మారుస్తామని పేర్కొన్నారు. ఒక్కో పార్కు అభివృద్ధికి రూ. 5లక్షలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన రోడ్లతో పాటు వార్డుల్లో విద్యుత్ లైట్లు, మురుగు కాలువలు, రోడ్లు వేస్తామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే వార్డుల పర్యటన చేయడం చాల సంతోషమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్ని తూచ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.