కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపిఎల్) ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న ఈ టోర్నమెంట్.. వాయిదా కారణంగా బ్రాండ్ వాల్యూను ఘోరంగా కోల్పోయింది. గత ఏడాది మొత్తం టోర్నమెంట్ను అబుదాబిలో ప్రేక్షకులు లేకుండా నిర్వహించడంతో ఐపీఎల్ బ్రాండ్ విలువ 3.6 శాతం పడిపోయిందంట. అయితే, ప్రేక్షకులు, ఆన్-ఫీల్డ్ మ్యాచ్ల సమయంలో ఆహార పదార్థాల అమ్మకాల ద్వారా 20 శాతం ఆదాయాన్ని పొందాయంట.
గత ఏడు సంవత్సరాలుగా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ నివేదికను డఫ్ అండ్ ఫెల్ప్స్ వెల్లడించింది. వీరి నివేదిక ప్రకారం.. క్లోజ్ డోర్ మ్యాచ్ తర్వాత కూడా ఐపీఎల్, దాని జట్లు ఆదాయాన్ని కోల్పోయాయి. కరోనా కారణంగా ప్రజలు ఇంట్లో ఉండి మ్యాచులను చూస్తుండటంతో ప్రసారదారులకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చింది.
2014 లో ఐపీఎల్ ప్రారంభమవగా.. ఆ ఏడాది రూ.19,500 కోట్ల బ్రాండ్ వాల్యూను పొందింది. అయితే, మరుసటి సంవత్సరం రూ.21,300 కోట్లతో 9 శాతం బ్రాండ్ వాల్యూను, 2016 లో రూ.27,500 కోట్లతో 29 శాతం, 2017 లో రూ.34,400 కోట్లతో 25 శాతం, 2018 లో రూ.41,800 కోట్లతో 22 శాతం, 2019 లో రూ.47,500 కోట్లతో 14 శాతం, 2020 లో రూ.45,800 కోట్లతో 3.6 శాతం బ్రాండ్ వాల్యూను సాధించింది.
జట్ల బ్రాండ్ విలువ విషయానికొస్తే.. చెన్నై, కోల్కతా నైట్ రైడర్స్ చాలా నష్టపోయాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే చెన్నై బ్రాండ్ విలువ 16.5 శాతం తగ్గగా.. కేకేఆర్ బ్రాండ్ విలువ 13.7 శాతం తగ్గిపోయింది. అయితే, ఈ నష్టానికి జట్ల ఆటతీరే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై చెత్త ప్రదర్శన కనబరుస్తుండగా.. కోల్కతా ఆటతీరు ఈ ఏడాది ప్రత్యేకంగా లేదనే చెప్పాలి.
ముండై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ 2020 లో రూ.761 కోట్లతో 5.9 శాతం పడిపోగా.. చెన్నై రూ.611 కోట్లతో 16.5 శాతం, కోల్కతా రూ.543 కోట్లతో 13.7 శాతం, బెంగళూరు రూ.536 కోట్లతో 9.9 శాతం, హైదరాబాద్ రూ.442 కోట్లతో 8.5 శాతం, పంజాబ్ రూ.318 కోట్లతో 11.3 శాతం, రాజస్థాన్ రూ.249 కోట్లతో 8.1 శాతం బ్రాండ్ వాల్యూ కోల్పోగా.. అతి తక్కువగా ఢిల్లీ జట్టు రూ.370 కోట్లతో కేవలం 1 శాతమే బ్రాండ్ వాల్యూను కోల్పోయింది.
ప్రస్తుతం టోర్నమెంట్ పూర్తిగా రద్దయింది. దీంతే బోర్డు దాదాపు రూ.2,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తుంది. అలాగే, ఈ ఏడాది భారతదేశంలో నిర్వహించే టీ 20 ప్రపంచ కప్కు కూడా ఇలాంటి ముప్పే పొంచి ఉన్నది. ఆతిథ్య హక్కులను భారతదేశం నుంచి ఇతర దేశాలు తీసుకుపోతే బీసీసీఐ మరింత నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
ఉత్తరాఖండ్లో భారీ వర్షం.. బురదలో కూరుకుపోయిన ఇండ్లు
తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ.. చరిత్రలో ఈరోజు
పంచాయతీ విజయం చూడకముందే ముగ్గుర్ని కాటేసిన కరోనా
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..