చేవెళ్ల టౌన్ : ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే వారిపై కేసు నమోదు చేస్తామని తాసీల్దార్ అశోకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని బస్తేపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 48లో అక్రమంగా నిర్మిస్తున్న వాటార్ ప్లాంట్ను గిర్దావరి, రెవెన్యూ సిబ్బందితో కలిసి తొలగించి వాటార్ ప్యూరీపైర్ పరికరాన్ని తాసీల్దార్ కార్యాలయానికి తరలించామని తెలిపారు. చేవెళ్ల మండలంలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.