షాద్నగర్ : అన్ని వర్గాల ప్రజలు భక్తి భావంతో మెలుగాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని రుద్రాక్ష శివహనుమాన్ దేవాలయం ఆవరణలో దేవాలయం ప్రారంభోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ఇష్ట దైవాన్ని కొలుస్తేనే మనిషికి మానసిక ప్రశాంతత కలుగుతుందని అభిప్రాయపడ్డారు. నూతనంగా నిర్మించిన దేవాలయం ప్రారంభోత్సవ సందర్భంగా భక్తి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు.
మూడు రోజుల పాటు నిర్వహించే పూజల్లో పట్టణ వాసులు భక్తిశ్రద్ధలతో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్, బచ్చలి నర్సింహ్మ, సర్వర్పాష, నాయకులు యుగేందర్, దామోదర్యాదవ్, వెంకటేష్గౌడ్ పాల్గొన్నారు.