వికారాబాద్ : మహాత్ముడు చూపిన బాటలో తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా చిత్రపటాలకు ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, కాలె యాదయ్యలతో కలిసి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ గాంధీజీ బాటలోనే అందరూ ముందుకు సాగాలని, ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం వైపు ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం మున్సిపల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకి మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జడ్పీటీసీ ప్రమోదిని, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ శంషాద్భేగం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, మాజీ గ్రంథాయల సంస్థ చైర్మన్ హఫీజ్, మాజీ జడ్పీటీసీ ముత్తహర్ షరీఫ్, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, నవీన్కుమార్, చందర్నాయక్, కిరణ్పటేల్, రామస్వామి, నాయకులు పాల్గొన్నారు.