పరిగి : మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శమని వికా రాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో వెనుకబడిన తర గతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం వేట గాడుగా ఉన్న వాల్మీకి దొంగగా మారి దారి దోపిడీలు చేశారని, ఆ తర్వాత నారద మహా ముని దివ్యోపదేశంతో కొన్ని సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నారన్నారు. ఆ తర్వాత రామాయణ కావ్యాన్ని రచించారని చెప్పారు. మనిషిలో మార్పు వస్తే మహర్షి కాగలరు అని నిరూపించింది వాల్మీకి మహ ర్షి అని తెలిపారు.
వాల్మీకి మహర్షి జీవితం మానవులకు ఆదర్శప్రాయమని, ఆయన జీవితాన్ని ముందు తరాలకు తెలియజేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రక మహ నీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ, వారిని స్మరించుకుంటుందని తెలిపారు. బీసీ కమీషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు మహర్షులవుతారని, వాల్మీకి మహర్షి చరిత్ర ఇందుకు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని పుష్పలత, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా స్థాయి అధికారులు, వాల్మీకి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.