పరిగి : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు డాక్టర్లు యుద్ధప్రాతిపదికన కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మండలాలవారీగా వ్యాక్సినేషన్పై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు వ్యాక్సిన్ మొదటి డోసు 3,95,035 మందికి, రెండో డోసు 78,368 మందికి ఇచ్చారన్నారు. 56 శాతం వ్యాక్సినేషన్ పూర్తికాగా.. 100 శాతం పూర్తి చేసేందుకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సహకారం తీసుకోవాలన్నారు. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు.
గురువారం నుంచి చేపట్టే పూర్తి వివరాలు తనకు సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా వైద్యాధికారి తుకారాం, డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో జీవరాజ్, డాక్టర్లు అరవింద్, లలిత, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.