కందుకూరు, ఆగస్టు 5 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. మండల పరిధిలోని సార్లరావుల పల్లి తండా సర్పంచ్ రజిత భర్త ప్రవీణ్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ గురువారం ఆమె నివాసంలో కలిసి నూతనంగా గ్రామ పంచాయతీ భవనంతో పాటు తమ తండా పరిధిలోని అనుబంధ తండాలకు నిధులు కేటాయించాలని ఆమెకు వినతిపత్రం సమర్పించారు. సార్లరావులపల్లి, బండమీదితం, గొట్టెలగడ్డ తండా, పొచమ్మగడ్డ తండా, పోతుబండతండా, సీసీ రోడ్డు అండర్డ్రైనేజీ పనులకు కోటి 24లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ పనులకు ఈ నెల 9వ తేదీన శంకుస్థాపన చేస్తానని ఆమె చెప్పారు. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కుమారుడు పట్లోల్ల కౌశిక్రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సామ మహేందర్రెడ్డి, కళ్లెం సదానంద్గౌడ్ పాల్గొన్నారు.