వికారాబాద్ : గుండె పోటుతో మృతి చెందిన రామయ్యగూడ కౌన్సిలర్ ఆర్. నర్సింలు కుటుంబాన్ని మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకుఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్ కుమార్తో కలిసి పరామర్శించారు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పార్టీకి సేవలందించిన కౌన్సిలర్ను కోల్పోవడం బాదకరంగా ఉందని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి మనో ధైర్యాన్ని అందించారు. అదే విధంగా వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ ఆర్. నర్సింలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. వీరి వెంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.