బషీరాబాద్ : జీవన్గి కాగ్నానదిపై నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం మంగళవారం వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బ్రిడ్జి కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం కోసం భూమి కోల్పోతున్న రైతుల వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 14మందికి చెందిన 11ఎకరాల భూమి రోడ్డు నిర్మాణానికి అవసరమవుతుందనిన్నారు. రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోతున్న రైతులతో గ్రామసభ ఏర్పాటు చేసి రైతుల చేత అంగీకార పత్రాలను తీసుకున్నట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్కు వివరించారు. రైతులు వారి భూమికి సంబంధించి ఒక ధర చెప్పి ఉన్నారని, అట్టి నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే రైతుల నుంచి భూసేకరణ మొదలుపెడతామని రెవెన్యూ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఉప తాసిల్దార్ విరేశ్బాబు, గ్రామ పెద్దలు మాణిక్రెడ్డి, నర్సిరెడ్డి, బీంరెడ్డి ఉన్నారు.