కొడంగల్ : కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కొడంగల్ పరిధిలో 54.8 మీ.మి వర్షపాతం నమోదు అయినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పెద్దనందిగా, ఖాజాఅహ్మద్పల్లి గ్రామాలతో పాటు మైసమ్మతండా ప్రాంతాల రాకపోకలకు ఇబ్బందుల ఏర్పడ్డాయి. గ్రామ, తండాకు వెళ్లే దారి మధ్యలో ఉన్న కల్వర్టులు వరద నీటితో నిండుకొని ప్రవహిస్తుండటంతో ఎక్కడి వారు అక్కడ ఉండిపోయారు. నీటి ప్రవాహం తగ్గిన తరువాత గ్రామాలకు చేరుకున్నారు.