వికారాబాద్ : వికారాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయంలో డెలివరీ పాయింట్లలో పని చేయుటకు 6 స్టాఫ్నర్సు పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని డీఎంహెచ్వో తుకారం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ సర్టిఫికేట్ కాఫీతో పాటు యాక్టివ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్, మహిళా అభ్యర్థులు మాత్రమే నర్సు ప్రాక్టీషనర్ మిడ్వైఫరీ (ఎన్పీఎం) శిక్షణకు అర్హులన్నారు. అభ్యర్థులు 34 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు, రిజర్వేషన్ కలిగి ఉండాలని తెలిపారు. కనీసం రెండు సంవత్సరాలు లేబర్ రూమ్ అనుభవంతో పాటు గ్రామీణ/గిరిజన/చేరుకోవడానికి కష్టమైన ప్రాంతాల్లో ఒక సంవత్సరం లేబర్రూమ్ అనుభవం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.
నేషనల్ హెల్త్ మిషన్ నిర్వహిస్తున్న నర్సు ప్రాక్టీషనర్ మిడ్వైఫర్ కోసం 18 నెలల రెసిడెన్షియల్ కోర్సులో ప్రవేశించడానికి ఈ ఆఫ్లికేషన్ పరిగణించబడుతుందన్నారు. ఈ నెల 18 నుంచి 21వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.