వికారాబాద్ జిల్లా బృందం : మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ము స్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘ నంగా జరుపుకున్నారు. పరిగిలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, నా ర్మాక్స్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి పాల్గొన్నా రు. కొడంగల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను సోదరభావాన్ని బోధించారని గుర్తు చేశారు. వారి మార్గంలో పయనిస్తూ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థించాలని సూ చించారు. మహమ్మాద్ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ వారి బోధనలు సార్థకం చేయాలని కోరారు.
వికారాబాద్ పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ వద్ద ఉన్న మజీద్ నుంచి ఆలంపల్లిలోని దర్గా వరకు ముస్లిం సోదరులు భారీగా ర్యాలీ నిర్వహించారు. మజీద్లలో చిన్నారులు, పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ మహ్మద్ప్రవక్తను స్మరించుకున్నారు. తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామంలో అన్నదానం చేశారు. పెద్దేముల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక యువకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్వమతాల సారాంశం ఒక్కటేనని, సమాజంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్గా జీవనం కొనసాగిస్తూ గంగా జమునా తెహజీబ్ను కాపాడుకొంటూ, మతసామరస్యంతో ముందుకు సాగాలన్నారు.