పరిగి, జూలై 30: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలో జన్ సాహస్ సంస్థ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్కార్డులు, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు కొనసాగించిందన్నారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్థిక సాయం, రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించిందన్నారు. రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, నెలకు రూ.1500 సాయం అందించిందన్నారు. స్వచ్ఛంద సంస్థలు సైతం నిరుపేదలకు చేయూతనిస్తూ నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమన్నారు.
జన్ సాహస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎర్రగడ్డపల్లికి చెందిన ఫయాజ్ చికిత్స కోసం రూ.50వేలు మంజూరు చేయించి, ఎల్వోసీ కాపీని ఆయన కుటుంబీకులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కె.అరవిందరావు, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఎ.సురేందర్కుమార్, జన్ సాహస్ స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షుడు నవీన్కుమార్, జిల్లా కో-ఆర్డినేటర్ ప్రకాశ్కుమార్, కౌన్సిలర్లు వారాల రవీంద్ర, ఎదిరె కృష్ణ, వెంకటేశ్, నాగేశ్వర్రావు, బి.రవికుమార్, కైసర్పాషా, రియాజ్, మల్లేశం, అబ్దుల్ బషీర్, సంస్థ సలహాదారుడు వెంకటయ్య, గౌస్పాష, ఫసియోద్దీన్, యూసుఫ్ పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇడ్ల నిర్మాణ స్థల పరిశీలించిన ఎమ్మెల్యే
దోమ, జూలై30: మండల కేంద్రంలోని సర్వే నంబరు 27లో డబుల్ బెడ్రూమ్ ఇడ్ల నిర్మాణ స్థలాన్ని జడ్పీటీసీ నాగిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఆయనతో రోడ్లు భవనాల శాఖ అధికారి ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్యగౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, మాజీ ఎంపీపీ రాజగోపాలచారి, వార్డు సభ్యులు లక్ష్మణ్, మైను, నాయకులు వెంకటయ్య, గౌస్, యాదయ్య, ముస్తాఫా, నారాయణ, శ్రీనివాస్, రాజు ఉన్నారు.